జనం న్యూస్ 15 మార్చ్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఉట్నూర్/జైనూర్, : ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ మండలాల్లో శనివారం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరిక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు శిక్షణ విద్యార్థులు పరీక్షలు రాయడానికి విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి పంపించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు రాసిన పరీక్షలు అధికారులు పరిశీలించారు. పరిక్ష కేంద్రంలో ఎలాంటి మాస్ కాపీoగ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఉట్నూర్ జైనూర్, సిర్పూర్ (యు )మండలాల్లోని పరీక్షా కేంద్రాలను జైనూర్ ఆడ బీర్షావ్, ఉట్నూర్, సిర్పూర్ (యు )మండల విద్యాశాఖ అధికారులు ఆశన్న, కుడి మేత సుధాకర్ లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పలు సూచనలు ఇచ్చారు. కేంద్రాల వద్ద పోలీస్ ల తో భద్రత చర్యలు తీసుకున్నారు.