ముగిసిన సంక్రాంతి సంబరాలు: తిరుగు ప్రయాణంలో కిక్కిరిసిన విజయనగరం!

జనం న్యూస్‌ 19 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ సంక్రాంతి సెలవులు ముగియడంతో విజయనగరం బస్టాండ్, రైల్వే స్టేషన్లలో శనివారం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వగ్రామాల నుంచి పట్టణాలకు తిరుగు ప్రయాణమైన వారితో వాహనాలన్నీ కిక్కిరిసిపోయాయి. రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులు ఓపికతో సహకరించాలని కోరారు. కొన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సులు పూర్తిగా నిండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *