జనం న్యూస్ మార్చ్ 15 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గౌరవ పసుపులేటి బాలరాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులుగా నియమితులైన శుభ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం నుంచి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం, గతం లో తన పదవి హాయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల నుంచి గుర్తింపు పొందినటువంటి ప్రజా ప్రతినిధి, గిరిజన ప్రాంతం నుంచి అప్పటినుంచి ఇప్పటివరకు ఏకైక లీడర్ గా ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రజాప్రతినిధి మాజీ మంత్రివర్యులు పసుపులేటి బాలరాజు , రాష్ట్రంలో యువతని సపోర్ట్ చేస్తూ పార్టీ కార్యక్రమాల్లోకి యువతనే తీసుకు వెళ్తూ, పార్టీని మరింత అభివృద్ధి చెందే దిశగా యువతని సహకరించాలని మాజీ మంత్రివర్యులు పసుపులేటి బాలరాజు కి మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ , కోరుచున్నాను ఇట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రీమల గంగాధర్, అల్లూరి జిల్లా గ్రీవెన్స్ మాజీ కార్యదర్శి గుట్టేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు