జనం న్యూస్,మార్చి 15 పశ్చిమగోదావరి జిల్లా, తణుకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అజయ్ కుమార్ రెండు తెలుగు రాష్ట్రల చరిత్ర లో కని విని ఎరగని మెజారిటీ సాధించారు ఈ సందర్భంగా తణుకు బార్ అసోసియేషన్ నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏలూరి అశోక్ కుమార్ రాష్ట్ర ఈ సి మెంబెర్స్ ఆకాశపు బాలరాజు నెక్కంటి క్రాంతి కుమార్ అడబాల దుర్గా ప్రశాంతి ఐ ఏ లో నాయకులు పినిపే డేవిడ్ రాజు అజయ్ కుమార్ ను కలిసి సత్కరించారు అశోక్ కుమార్ మాట్లాడుతు ఇంతటి ఘన విజయానికి కారణమైన రాష్ట్ర ఐఏఎల్ నాయకులు కు సహచర న్యాయ వాదులుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అజయ్ కుమార్ గారి గెలుపు తొ రాష్ట్రము లో న్యాయ వాదుల కు సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తారు అని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసికురావడానికి వారి సాయశక్తుల ప్రయత్నం చేస్తారని జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం మరియు బార్ లా అభివృద్ధి కి కృషి చేస్తారని తెలిపారు.