జనం న్యూస్ మార్చి 14 అడవిదేవులపల్లి అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని రిషి గ్రేట్ వే స్కూల్ లో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎంగా ముఖేష్, డిప్యూటీ సీఎం గా సాయి, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ప్రేమ్ సూర్య, కలెక్టర్గా మోతి మరియు డీఈఓ గా సాత్విక పాల్గొని వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస చారి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడం వలన పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను మరియు వారి యొక్క ఆలోచనలను బయటికి తీయడానికి వారికి లక్ష్యాలను ఎంచుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. మరియు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శంకర్, నాగ సైదులు, వెంకన్న, రాజేశ్వరి, కోటేశ్వరి, వీణ మొదలగు ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.