యుద్ధం వద్దు శాంతి కావాలని నిరసన..

జనం న్యూస్ 14 మార్చి 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజక వర్గం,నంద్యాల జిల్లా : సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకించాలని ప్రపంచ శాంతిని కాపాడాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్బంగా సిఐటియు జిల్లా నాయకుడు రత్నమయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్,కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహులు, లింగన్న వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కుళాయి స్వామి తదితరులు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై యుద్ధము ప్రకటిస్తూ మానవాళి మనుగడకు ముప్పు తెస్తున్న యుద్ధోన్మాదం నశించాలని అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పై దాడులు చేసి ఇరాన్ లో ఉన్న ఆయిల్ ను దోచుకోవడానికి ఇరాన్ లో అను ఆయుధాలు ఉన్నాయని పేరుతో ఆ దేశం పై దాడి చేసి ప్రజలను అక్కడి రక్షణ మంత్రిని యుద్ధంలో చంపడం దారుణమని మనదేశంలోని నరేంద్ర మోడీ యుద్ధం పై మాట్లాడకుండా అమెరికాకు ఇజ్రాయిల్ అనుకూలంగా ఉన్నారని భారత దేశ చరిత్రలో ఇజ్రాయిల్ లో మనకు శత్రుదేశం అని అలాంటి శత్రుదేశంతో ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్ లో పర్యటించి దిగుమతులను ఎగుమతులను ఒప్పందం చేసుకున్నాడని ఇది చాలా దుర్మార్గమైన చర్య మన రాష్ట్రంలోని పూట మీ ప్రభుత్వం ప్రతిపక్షం యుద్ధం పై ఖండించకుండా మాట్లాడకుండా ప్రజలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని ఇబ్బందులు గురవుతామని యుద్ధాన్ని ఆపాలని ప్రజలు చర్చించుకుంటున్న నోరు మెదపని ప్రభుత్వం ఉందని వెంటనే యుద్ధం పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు లింగన్న శీను ఎల్లయ్య భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అయూబ్ పెద్ద ఓబులేష్ డప్పు కళాకారుల సంఘం నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *