జనం న్యూస్ 21 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్: జోగులాంబ గద్వాల్ జిల్లా ఈ ప్రాంతంలోని ప్రజల ఎన్నో ఏళ్ల కల ప్రజాపాలన లో సాధ్యమవుతుంది. జూరాల ప్రాజెక్టు బ్రిడ్జి తో పాటు ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం భవిష్యత్తులో గద్వాల ప్రాంతం ఆత్మకూరు ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో గద్వాల మండల పరిధిలోని కొత్తపల్లి నుండి ఆత్మకూరు వైపుగా వెళ్లే జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను పరిశీలించడానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి కి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. మంత్రిగారు ఎమ్మెల్యే జూరాల ప్రాజెక్టు హై లెవెల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించడం జరిగినది. జూరాల ప్రాజెక్ట్ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించి సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ తో మాట్లాడటం త్వరగా పనులను పూర్తి చేసి ప్రజల్లోకి అందుబాటులో తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడుతూ గత సంవత్సరం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు జూరాల ప్రాజెక్టు సందర్శన పరిశీలనకు వచ్చిన సందర్భంలో ప్రాంతం ప్రజలు గద్వాలకు ఆత్మకూరు అనుసంధానంగా జూరాల హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. వెంటనే మంత్రి దీని ఆమోదం చేసి ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకువెళ్లి ప్రాంతాలకు మధ్య అనుసంధానం ఉండడంవల్ల ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ దానివల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతూనే చెప్పిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రివర్యులు 121 కోట్లు రూపాయలు మంజూరు చేయడం జరిగింది వెంటనే సీఎం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం చాలా సంతోషం అని హర్షం వ్యక్తం చేశారు. ఆత్మకూరు నుండి గద్వాలకు వెళ్లాలనుకుంటే పదినిమిషాల్లో గద్వాల్ లో చేరుకుంటారు అదేవిధంగా గద్వాల నుండి హైదరాబాదు వెళ్లే వారికి 35 కిలోమీటర్ వరకు రవాణా సౌకర్యం తగ్గుతుంది అని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం తరుణంలోనే ఫోర్ లైన్ ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేయాలని ఆలోచించడం జరిగింది. ఈ ఫోర్ లైన్ నిర్మాణం చేయడం వల్ల గద్వాల నుండి ఆత్మకూర్ మక్తల్ , మంత్రాలయం, బళ్లారి వరకు వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కావడం వల్ల మేమున్న లేకపోయినా మా హయాములో బ్రిడ్జి నిర్మాణం కావడం జరిగిందని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అని పేర్కొన్నారు. ప్రాజెక్టు లో నీళ్లు నిలువ ఉంచడానికి చెక్ డాంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి నెమలి చెరువు నామకరణం చేయడం జరుగుతుందని తెలిపారు.జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఉమ్మడి పాలమూరు జిల్లా తోపాటు తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. ఈ గద్వాల ఆత్మకూర్ ప్రాంతం మన సౌకర్యంతో పెరగడం వల్ల వ్యాపారంలో కూడా పెరుగుతాయి రైతులు కూడా అభివృద్ధి చెందుతారు దీని వల్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందిన తో పాటు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం కొత్తపల్లి మహేశ్వర్ రెడ్డి నివాసంలో మంత్రిగారు ఎమ్మెల్యే టిఫిన్ చేసి తేనెటీ విందును స్వీకరించారు ఈ సందర్భంగా మా ప్రాంత ప్రజలను తరఫున సీఎం కి, ఆర్థికశాఖ మంత్రివర్యులు కి, నీటి పారుదల శాఖ మంత్రివర్యులు కి ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే గద్వాలకు అను సంధానంగా ఆత్మకూరు మక్తల్ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఈ రెండు ప్రాంతాలకు అనుసంధాలు ఉన్నప్పుడే మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మా ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున ఉండడం వల్ల ఆ ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఇప్పుడు మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఈ జూరాల ప్రాజెక్ట్ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయడం వల్ల ఈ రెండు ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుంది. దీనివల్ల హైదరాబాద్ వంటి ఇతర ప్రాంతాలకు ఏ విధంగా అనుసంధానం ఉంటుందా వల్ల ఆ ప్రాంతాలు ఏ విధంగా భవిష్యత్తులో మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు. గతంలో జూరాల ప్రాజెక్టు సందర్శన వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఈ ప్రాంతానికి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలని కోరడంతో వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ నిర్మాణం పనుల్లో భాగంగా ఫోర్ లైన్స్ రోడ్డు అనుసంధాన తో ఏర్పాటు చేయడం వల్ల గద్వాల నుండి మంత్రాలయం మంత్రాలయం నుండి బళ్లారి వరకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ప్రాంతాలకు అనుసంధానం ఏర్పాటు వల్ల ఈ ప్రాంతాలలోని ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందారు. వ్యాపార రంగాలు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందడం వల్ల ప్రజలకు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే అది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్దేశం నెరవేడుతుందని. అప్పుడే బంగారు తెలంగాణ రాష్ట్రంగా వైపుగా అడుగులు వేసే దిశగా చేస్తుందని చెప్పారు. గద్వాల నుండి హైదరాబాద్ కు వెళ్లడానికి వారికి కూడా ఆత్మకూరు వైపుగా వెళితే దాదాపుగా 35 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. పది నిమిషాలలో ఆత్మకూరుకు కొరకు చేరుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టులు లోయర్ జూరాల దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతపు చెక్ డ్యామ్ ఏర్పాటు చేస్తే 4&5 టీఎంసీల నీళ్లు నిలువ ఉంచడం వల్ల రైతులకు నీళ్లు ఉపయోగపడితే దీనివల్ల రైతులు కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది అని తెలిపారు. భవిష్యత్తులో గద్వాల ఆత్మకూర్, మక్తల్ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే విధంగా అవకాశం ఉంటుందని తెలిపారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు సహకరించిన సీఎం కి మంత్రివర్యులు కి ప్రత్యేక గద్వాల నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జిల్లా సర్పంచులు సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, సర్పంచ్ సుజాత నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.