జనం న్యూస్, జనవరి 20, బోధన్ నియోజవర్గం మేడారం వెళ్ళలేని భక్తులకు ఆర్టిసి కార్గో ద్వార కేవలం రూ. 299/- లకే మేడారం సమ్మక్క – సారక్క ప్రసాదం ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీ బి. విశ్వనాధ్ గారు తెలిపారు. బోధన్ పట్టణం లోని డిపో కార్యాలయంలో సోమవారం సమ్మక్క – సారక్క ప్రసాదం పంపిణి కర పత్రాలను డిపో మేనేజర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ www.logistics.co.in అనే వెబ్ సైట్ ద్వారా లేదా ఆర్టిసి కార్గో కౌంటర్ల వద్ద బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్యాకేజి లో బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ మరియు అమ్మవార్ల ఫోటో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది గిరి, రాములు, సందీప్, నవీన్ కుమార్, బోధన్ డిపో కార్గో డీఎంఈ కిశోర్ పాల్గొన్నారు.