గోల్లలపాలేం కొట్నాబిల్లి గ్రామాల్లోపశు వైద్య శిబిరాలు

జనం న్యూస్ జనవరి 20, రావికమతం విలేఖరి గుమ్మడు వెంకటేశ్వరరావు ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలు ను గొల్లలపాలెం లో సోమవారం ప్రారంభించారు. సహాయ సంచాలకులు డా.పుష్ప,వైద్యులు డా. బాలతేజ, డా.నూకేష్, డా.దమయంతి ఎంపీటీసీ సూర్యనారాయణ ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం గొల్లలపాలెం మరియు కొట్నబిల్లి గ్రామాల్లో రెండు బృందాలు గా వెటర్నరీ సిబ్బంది మందులు పంపిణీ చేపట్టారు. శిబిరం లో మందులు, వాక్సినేషన్, నట్టల నివారణ, ఎద మందులు , వైద్య సేవలు ఉచితంగా అందచేస్తామని , రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సహాయ సంచాలకులు డా.పుష్ప మాట్లాడుతూ ఈ పశు ఆరోగ్య శిబిరాలు ఈ నెలాఖరు వరకు వివిధ మారుమూల గ్రామాల్లో జరుగుతాయని ఈ సేవలు ను రైతులు సద్వినియోగం చేసుకునేలా పత్రికా ప్రతినిధులును, ప్రజా ప్రతినిధులు, అభ్యుదయ రైతులు సహకరించ వలసినదిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *