జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మనుషులతో పాటు పశువులపై దాడి చేసిన సందర్భాలూ లేకపోలేదు. మెయిన్ రోడ్లపైకి వచ్చి బైకర్ల వెంట పడుతుండడతో వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈరోజు కూడా రాజాంలో ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.